Hyderabad: కిరాతకుడు.. అంతా పడకున్నాక భార్య దగ్గరకు కత్తితో వెళ్లిన భర్త.. చివరకు..

ఈ మధ్య కాలంలో భార్యభర్తల హత్యలు కలవరపెడుతున్నాయి. ప్రియుడు కోసం భార్యలు భర్తను కడతేర్చుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అదే సమయంలో అనుమానంతో పాటు చిన్న చిన్న విషయాలకే భర్తలు భార్యలను కిరాతకంగా చంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే మేడ్చల్ జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను దారుణంగా చంపి ముక్కలు చేశాడు. ఈ ఘటన మరవక ముందే హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానంతో ఓ భర్త తన భార్యను కత్తితో […]

Continue Reading

ఇంత దారుణమా.. ప్రియురాలిని సూట్‌కేసులో ప్యాక్ చేసి.. 100 కిలోమీటర్ల దూరంలో..

కాన్పూర్ దేహత్ ప్రాంతానికి చెందిన ఆకాంక్ష అలియాస్ మహి అనే యువతి బర్రాలో ఒక రెస్టారెంట్‌లో పనిచేసేది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సూరజ్ ఉత్తమ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారి స్నేహం ప్రేమగా మారి మూడు నెలల క్రితం ఇద్దరూ హనుమంత్ విహార్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కలిసి జీవించడం ప్రారంభించారు. సూరజ్‌కు మరొక మహిళతో సంబంధం ఉందని ఆకాంక్షకు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి […]

Continue Reading

కొంపముంచిన వాటర్ ఫాల్స్ సెల్ఫీ.. ఒకరు మృతి, ముగ్గురిని కాపాడిన యువకుడు

బతుకమ్మ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో అటవీశాఖ నిషేధిత వాటర్ ఫాల్స్ కొంగల జలపాతం వద్ద ఈ సంఘటన జరిగింది. అటవీశాఖ అధికారుల కళ్లుగప్పి వెళ్లిన సందర్శకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. సెల్ఫీ కోసం ప్రయత్నించిన యువకుడు జలపాతం కుంటలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించి, అదే నీళ్లలో మునిగిపోయిన మరో ముగ్గురిని ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీశాఖ అధికారులు, […]

Continue Reading

నువ్వు మాములోడివి కాదురోయ్.. ఇంటి కిందే కుంపటి.. గుట్టుచప్పుడు కాకుండా..!

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో తాబేళ్ల అక్రమ రవాణాకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. స్మగ్లర్లు తమ ఇంటి నేలమాళిగను చెరువుగా మార్చి అందులో తాబేళ్లను పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జౌన్‌పూర్ నుండి పశ్చిమ బెంగాల్‌కు రైలులో తాబేళ్లను రవాణా చేసేవారు. ఒక్కొక్కరికి 6,000 రూపాయలు చొప్పున అందుకుంటున్నారు. ఖేతసరై రైల్వే స్టేషన్ సమీపంలో అమేథికి చెందిన ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్టుతో అసలు వ్యవహారం బయటపడింది. నిందితుల నుండి 60 తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాబేళ్ల […]

Continue Reading

Hyderabad: మరోసారి హైడ్రా కూల్చివేతలు.. గాజులరామారంలో హైటెన్షన్‌.. హైడ్రా చీఫ్ ఏమన్నారంటే..

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు హైటెన్షన్‌కు దారితీశాయి.. దీంతో గాజులరామారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు.. తాము కొనుక్కున్న ఇళ్లను కూల్చవద్దని వేడుకున్నారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చివేయడంపై ఆవేదన వ్యక్తంచేశారు. జేసీబీలను అడ్డుకుని ధర్నాకు దిగిన గాజులరామారం బాధితులు.. ఇళ్లను అమ్మినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బతుకమ్మ పండుగ వేళ […]

Continue Reading

OG Movie: పవన్ కళ్యాణ్ OG సినిమా టికెట్‌కు రికార్డ్‌ ధర.. వేలంపాటలో లక్షా 29వేల 999 రూపాయలు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇటు సినిమా రంగంలోనూ.. అటు రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం OG నీ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను ఈనెల 25వ తేదీన విడుదలకు రంగం సిద్ధం చేశారు.

Continue Reading

రూ. 150 కొట్టు మేకను పట్టు.. మందు, కోళ్లు, బీర్లు కూడా.. దసరా బంపర్ ఆఫర్, ఎక్కడంటే..?

తెలంగాణ ప్రజలకు దసరా పెద్ద పండుగ. బతుకమ్మ సంబరాలతో ఊర్లలో తొమ్మిది రోజులపాటు సందడి వాతావరణం ఉంటుంది. ఇక దసరా పండుగ వేళ తెలంగాణలోని ప్రతి ఇంటా ఉండే మందు, విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనం సైతం పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతారు. అయితే ఇలాంటి దసరా పండుగ సందర్భంగా తెలంగాణలోని ఓ గ్రామంలో వినూత్నంగా ‘‘దసరా బంపర్ ఆఫర్’’ పేరుతో ఓ స్కీమ్‌ను తీసుకొచ్చారు. ఈ బంఫర్ ఆఫర్‌లో […]

Continue Reading

Rain Alert: బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 గంట‌ల్లో భారీ వ‌ర్షాలు.. ఎక్కడెక్కడంటే?

ఇప్పటికే భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్న తెలంగాణ వాసులకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాల వివరాలను కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ సహా రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట‌, ములుగు, మ‌హ‌బూబాబాద్, న‌ల్లగొండ‌, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని […]

Continue Reading

దసరా ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలు దసరా నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్నాయి. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయి.. అక్టోబర్ 2వ తేదీ వరకూ జరగనున్నాయి. అయితే ఈ ఏడాది నవరాత్రులు 9 రోజులు కాదు.. 10 రోజులు జరుపుకోనున్నారు. ఈ నేపధ్యంలో విజయదశమితో కలిపి మొత్తం 11 రోజులు దసరా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రి కూడా దసరా ఉత్సవాలకు అందంగా ముస్తాబైంది. […]

Continue Reading

ఎస్సెస్సీ సీజీఎల్ ఆన్‌లైన్‌ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు యత్నం.. కమిషన్‌ మాస్ వార్నింగ్

హైదరాబాద్‌, సెప్టెంబర్ 21: దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (సీజీఎస్ఈ) 2025 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పరీక్షల సమయంలో కొన్ని కేంద్రాల్లో రిమోట్ హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగినట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) గుర్తించింది. సెప్టెంబరు 12న దేశ వ్యాప్తంగా ప్రారంభమైన సీజీఎల్ పరీక్షలు సెప్టెంబర్‌ 26 వరకూ జరగనున్నాయి. దేశవ్యాప్తంగా అనేక పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు […]

Continue Reading