బతుకమ్మ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో అటవీశాఖ నిషేధిత వాటర్ ఫాల్స్ కొంగల జలపాతం వద్ద ఈ సంఘటన జరిగింది. అటవీశాఖ అధికారుల కళ్లుగప్పి వెళ్లిన సందర్శకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. సెల్ఫీ కోసం ప్రయత్నించిన యువకుడు జలపాతం కుంటలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించి, అదే నీళ్లలో మునిగిపోయిన మరో ముగ్గురిని ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీశాఖ అధికారులు, గజఈతగాళ్లు డెడ్ బాడీని బయటకు తీశారు.

