విశాఖలో షాపుల తొలగింపుపై వైసీపీ ఆగ్రహం

విశాఖలో జీవీఎంసీ అధికారులు రోడ్డు పక్కన ఉన్న బడ్డీలు, తోపుడు బండ్లను నోటీసులు లేకుండా తొలగించడాన్ని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె. కె రాజు శనివారం తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను అడ్డుకునేందుకు ఆయన స్థానికులతో కలిసి శనివారం సీతమ్మధారలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వద్ద నిరసన తెలిపారు. చిరు వ్యాపారుల కడుపు కొట్టే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.

Continue Reading

విశాఖ: రోడ్డుకు అడ్డంగా కారు… ట్రాఫిక్ ఇబ్బందులు

విశాఖపట్నంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి ఒక బీజేపీ నాయకుడి కారు రోడ్డు మధ్యలో ఆగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల అటుగా వెళ్తున్న వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కారు యజమాని గురించి ఆరా తీశారు. పోలీసులు కారును తొలగించేంత వరకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Continue Reading

లోకేష్ ఫౌండేషన్ ఆర్థిక సాయం

లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతి జిల్లాలో సమస్యలను గుర్తించి, ఫౌండేషన్ అధ్యక్షులు చదరం తులసి రామ్ పరిశీలించి, టీంతో చర్చించి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో, రాష్ట్ర ఫౌండేషన్ కోఆర్డినేటర్ గోపిశెట్టి గోపి సమాచారం మేరకు, పక్షవాతంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త అవతార్ గారికి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందజేశారు.

Continue Reading

గాజువాక: చిరువ్యాపారుల పొట్టకొట్టొద్దు

గాజువాకలో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారుల బడ్డీలు, తోపుడు బండ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని గాజువాక హాకర్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కసిరెడ్డి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కొత్త గాజువాకలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చర్య వల్ల చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని అన్నారు. చిరు వ్యాపారులను అదే స్థలంలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు.

Continue Reading