కాన్పూర్ దేహత్ ప్రాంతానికి చెందిన ఆకాంక్ష అలియాస్ మహి అనే యువతి బర్రాలో ఒక రెస్టారెంట్లో పనిచేసేది. ఇన్స్టాగ్రామ్ ద్వారా సూరజ్ ఉత్తమ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారి స్నేహం ప్రేమగా మారి మూడు నెలల క్రితం ఇద్దరూ హనుమంత్ విహార్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కలిసి జీవించడం ప్రారంభించారు. సూరజ్కు మరొక మహిళతో సంబంధం ఉందని ఆకాంక్షకు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి గొడవ తీవ్రం కావడంతో సూరజ్ ఆకాంక్షను గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అతను తన స్నేహితుడు ఆశిష్కు ఫోన్ చేసి సహాయం కోరాడు. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ఒక సూట్కేస్లో పెట్టి బైక్పై దాదాపు 100 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, చిల్లా బ్రిడ్జి వద్ద యమునా నదిలో పడేశారు.

