ఇప్పటికే భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్న తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాల వివరాలను కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, ములుగు, మహబూబాబాద్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని.. వర్షాల ప్రభావాన్ని బట్టి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.

