లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతి జిల్లాలో సమస్యలను గుర్తించి, ఫౌండేషన్ అధ్యక్షులు చదరం తులసి రామ్ పరిశీలించి, టీంతో చర్చించి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో, రాష్ట్ర ఫౌండేషన్ కోఆర్డినేటర్ గోపిశెట్టి గోపి సమాచారం మేరకు, పక్షవాతంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త అవతార్ గారికి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందజేశారు.

