గాజువాకలో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారుల బడ్డీలు, తోపుడు బండ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని గాజువాక హాకర్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కసిరెడ్డి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కొత్త గాజువాకలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చర్య వల్ల చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని అన్నారు. చిరు వ్యాపారులను అదే స్థలంలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు.

